News July 5, 2024
సీఎంల భేటీ.. నీటి పంపిణీపై నో డిస్కషన్?

AP CM చంద్రబాబు, TG CM రేవంత్ రేపటి భేటీకి 10 అంశాలతో అజెండా ఖరారైనట్లు తెలుస్తోంది. 9,10 షెడ్యూళ్లలోని ఆస్తుల విభజన, APSFC, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తిపన్ను పంపకం, HYDలోని భవనాల తిరిగి అప్పగింత, ఉమ్మడి సంస్థల వ్యయాల తిరిగి చెల్లింపు, విభజన చట్టంలో లేని ఆస్తుల ప్రస్తావన తదితర అంశాలపై సీఎంలు చర్చించనున్నారట. అయితే ఈ భేటీలో నీటి పంపిణీ జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Similar News
News March 31, 2026
KMR: ఆటో బోల్తా.. తల్లీకొడుకులు మృతి (UPDATE)

తాడ్వాయి మండల శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందారు. లింగంపేట మండలం బాణాపూర్ నుంచి దోమకొండ మండలం ముత్యంపేటకు సీమంతం వేడుక కోసం 13మందితో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బాణాపూర్కు చెందిన డప్పు సాయిలు, అతని తల్లి పోశవ్వ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11మందికి తీవ్ర గాయాలవ్వగా, పోలీసులు వారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News March 31, 2026
కరెంట్ అఫైర్స్

* పారాలింపిక్ మెడలిస్ట్ షీతల్ దేవికి ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం
* తెలంగాణ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు సహా పది బిల్లులకు ఆమోదం
* బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా
* జీవితకాల కనిష్ఠాన్ని (₹95.12) తాకిన రూపాయి విలువ
* ₹3.24లక్షల కోట్ల బడ్జెట్కు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం
* PMAY, టిడ్కో స్కిమ్ కింద మరో 2.50లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం
News March 31, 2026
ఆందోళన వద్దు.. రూపాయి బానే ఉంది: నిర్మల

రూపాయి <<19515449>>పతనంపై<<>> ఆందోళన అక్కర్లేదని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 27 నాటికి రూపాయి 4.1% పడిపోయిందని తెలిపారు. అయితే సౌత్ కొరియన్ వాన్ (4.6%), థాయ్ భట్ (5.5%), ఫిలిప్పైన్ పెసో (4.8%) మొదలైన కరెన్సీలు ఇంతకన్నా ఎక్కువ క్షీణించాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ఆర్థికలోటును అదుపులో ఉంచడంపై భారత్కు ప్రశంసలు దక్కుతున్నాయన్నారు.


