News December 1, 2024
ఉస్మా’నయా’ ఆస్పత్రిపై సీఎం సమీక్ష

TG: హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి వెళ్లే రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సీనియర్ అధికారి దాన కిషోర్ను నియమించారు.
Similar News
News March 27, 2026
సీఎంలతో నేడు ప్రధాని మోదీ సమావేశం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో PM మోదీ ఈరోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత జరుగుతున్న మొదటి మీటింగ్ ఇదే. యుద్ధ ప్రభావం వల్ల తలెత్తే ఇంధన కొరత, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో రాష్ట్రాల సన్నద్ధతపై ఇందులో చర్చించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని రాష్ట్రాల సీఎంలు ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు.
News March 27, 2026
ఈ టైమ్లో ఎక్సర్సైజ్ చేస్తే గుండె సేఫ్!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేసే టైమింగ్ ముఖ్యమని తాజా స్టడీలో తేలింది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వర్కౌట్ చేసేవారికి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వెల్లడించింది. దీనివల్ల ఒబెసిటీ 35%, గుండె జబ్బులు 31%, షుగర్ రిస్క్ 30% తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఉదయం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం, కొవ్వు త్వరగా కరగడం దీనికి కారణాలు.
News March 27, 2026
బ్రేక్ఫాస్ట్ మెనూ రెడీ: 6 రోజులు.. 5 రకాలు

TG: ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది విద్యార్థుల కోసం ‘CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ మెనూను అధికారులు రెడీ చేశారు. దీని కోసం ప్రభుత్వం ₹720 కోట్లు కేటాయించింది. ఈ మెనూ ప్రకారం.. సోమవారం దోశ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ, గురువారం మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా/పొంగల్, శనివారం బోండా అందజేస్తారు. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు.. మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ ఇస్తారు.


