News July 11, 2024
నేడు 3 జిల్లాల్లో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం పదింటికి వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోగాపురం ఎయిర్పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. వైజాగ్లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.
Similar News
News January 15, 2026
షుగర్ తగ్గాలా? తిన్న తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి!

బ్లడ్ షుగర్ లెవల్స్ను తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, భారీ వ్యాయామాలు అవసరం లేదని AIIMSలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కేవలం 10 ని.ల నడక మందులకన్నా బాగా పనిచేస్తుందని తెలిపారు. నడిచినప్పుడు రక్తంలోని గ్లూకోజ్ను కండరాలు ఇంధనంగా వాడుకుంటాయి. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ సడన్గా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కాలేయంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.
News January 15, 2026
సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశువులను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది’ అని పేర్కొన్నారు.
News January 15, 2026
ప్రహరీగోడ ఎత్తులో హెచ్చుతగ్గులు ఉండవచ్చా?

ఇంటి ప్రహరీగోడ ఎత్తు అన్ని వైపులా సమానంగా ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పడమర గోడ కంటే తూర్పు గోడ ఎత్తు తక్కువగా, ఉత్తరం కంటే దక్షిణం వైపు గోడ ఎత్తుగా ఉండాలని చెబుతున్నారు. ‘ఈ హెచ్చుతగ్గులు కొంచెం ఉన్నా సరిపోతుంది. ఈ నిర్మాణం ఇంటి రక్షణకు, ఐశ్వర్యానికి తోడ్పడుతుంది. దిక్కులు బట్టి గోడల ఎత్తులు అమర్చుకుంటే ఇంట్లో శాంతి, సౌఖ్యం, స్థిరత్వం లభిస్తాయి’ అంటున్నారు. Vasthu


