News October 22, 2024

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి: కిషన్ రెడ్డి

image

TG: దేశంలో పవర్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిగుమతులు తగ్గించుకుంటూ దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా మరింత కృషి జరగాలన్నారు. అవసరమైన చోట నిబంధనలు మార్చడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్మికులు, గనుల కోసం భూములు వదిలి వెళ్తున్న వారి సంక్షేమం కోసం MDOలు ఆలోచించాలని సూచించారు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.

Similar News

News October 22, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్‌పై UPDATE

image

AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ <<14417031>>సిలిండర్ల <<>>పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్(ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది. మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్‌కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది.

News October 22, 2024

కరీంనగర్‌లో ESI ఆస్పత్రికి విజ్ఞప్తి

image

TG: కరీంనగర్‌లో ESI ఆస్పత్రి నిర్మించాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. జిల్లా మెడికల్ హబ్‌గా మారిందని, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు వస్తున్నారని తెలియజేశారు. బీడీ, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందంటూ ESI ఆస్పత్రి ఏర్పాటు ఆవశ్యకతను సంజయ్ వివరించారు.

News October 22, 2024

దుర్గమ్మ దసరా ఉత్సవాల ఆదాయం రూ.9.26 కోట్లు

image

AP: దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భారీ ఆదాయం లభించింది. ఆలయంలోని మహా మండపంలోని మూడు విడతల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. మొత్తంగా రూ.9,26,97047 నగదు లభించినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 733 గ్రాముల బంగారం, 25.705 కిలోల వెండి లభ్యమైందన్నారు.