News July 17, 2024

4 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి: భట్టి

image

TG: సింగరేణికి కేటాయించిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. 4 నెలల్లో గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వెలుపల తొలిసారి చేపడుతున్న ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలన్నారు.

Similar News

News November 18, 2025

ఎన్‌కౌంటర్స్‌ మొత్తం ఫేక్: కూనంనేని

image

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లు మొత్తం ఫేక్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననమేనని, ఇది జంగిల్‌ రాజ్‌ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారని ఆరోపించారు. మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో సహా అన్ని ఎన్‌కౌంటర్లు కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు.

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.