News March 22, 2025
కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకోవాల్సిందే: పేర్ని

AP: కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బతకాల్సిందేనని YCP నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ‘మా పార్టీ నేతల అరెస్టులతో జగన్ పరపతి ఏమీ తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే జగన్కే సాధ్యం. ఈ విషయంలో చంద్రబాబు, పవన్.. జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News March 22, 2025
నేటి నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

AP: రాష్ట్రంలో KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏప్రిల్ 11వరకు <
News March 22, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. కాగా, రెండు రోజుల్లోనే వెండీ ధర ఏకంగా రూ.4100 తగ్గడం విశేషం.
News March 22, 2025
సైబర్ నేరగాళ్లకూ టార్గెట్.. ఛేదించకపోతే నరకమే!

ఉద్యోగాల కోసం ఏజెంట్ ద్వారా మయన్మార్, థాయ్లాండ్కు వెళ్లి సైబర్ ముఠా వలలో చిక్కుకున్న 589 మంది భారతీయులను కేంద్రం రక్షించింది. సైబర్ క్రైమ్స్ చేయడమే ఆ ఉద్యోగమని తెలియక అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘వీసా లాక్కుంటారు. టార్గెట్స్ చేరుకోకపోతే ఎండలో 4కి.మీలు పరిగెత్తిస్తారు. పుష్అప్స్ చేయిస్తారు. పాడైపోయిన బాతు గుడ్లు తినిపిస్తారు’ అని తెలంగాణకు చెందిన ఓ బాధితుడు BBCతో చెప్పారు.