News May 26, 2024
ఏపీలో కూటమిదే అధికారం: అమిత్ షా

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలోనూ తమదే అధికారమని పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 24-30, ఒడిశా, ఏపీలో 17 సీట్ల చొప్పున గెలుస్తామని తెలిపారు. కర్ణాటక, ఏపీలో ఓబీసీ కోటా కింద కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిందని దుయ్యబట్టారు. ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ సంరక్షిస్తుందని చెప్పారు.
Similar News
News November 14, 2025
ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

ABC జ్యూస్.. యాపిల్, బీట్రూట్, క్యారెట్తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.
News November 14, 2025
పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<


