News August 24, 2024

ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ దావా

image

తమ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌ వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ అనుబంధ సంస్థ ట్రైజెట్టో దావా వేసింది. కాగ్నిజెంట్ డేటాబేస్‌ను ఇన్ఫోసిస్ అక్రమంగా యాక్సెస్ చేసి పోటీ సాఫ్ట్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని టెక్సస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఇన్ఫోసిస్ ఖండించింది. చట్ట ప్రకారం ఎదుర్కొంటామని తెలిపింది.

Similar News

News November 22, 2025

రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

image

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్‌ను ఇస్తుందని సూచించారు. SHARE IT

News November 22, 2025

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్‌లో శ్రద్ధా నటిస్తున్నారు.

News November 22, 2025

6 నెలల్లో అమరావతి రైతుల సమస్య పరిష్కారం: కమిటీ

image

AP: అమరావతి రైతుల స‌మ‌స్య‌ల‌ను 6నెలల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని త్రీమెన్ క‌మిటీ హామీ ఇచ్చింది. 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 700 ఎకరాలపై సమస్య ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిశీలన తర్వాత జరీబు, మెట్టభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. లంకభూములపై గ్రీన్ ట్రిబ్యునల్‌ తీర్పు FEBలో వచ్చే అవకాశముందన్నారు. 719 మందికి మాత్రమే ఇంకా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ చెప్పారు.