News October 25, 2024
యాదృచ్ఛికం: టెస్టు రికార్డుల్లో కామన్గా 7/59
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ 7/59తో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే నాలుగు దశాబ్దాల్లో మొత్తం నలుగురు ప్లేయర్లే ఈ ఘనత సాధించారు. 1994లో అనిల్ కుంబ్లే, 2005లో ఇర్ఫాన్ పఠాన్, 2016లో అశ్విన్, 2024లో సుందర్ 7 వికెట్లు తీశారు. ఇందులో ప్రతిఒక్కరూ 7 వికెట్లు తీసి 59 పరుగులు సమర్పించారు. భారత్ అత్యధిక టెస్టు స్కోరు కూడా 759 పరుగులే.
Similar News
News October 25, 2024
ANR అవార్డ్స్-2024 వేడుకకు అమితాబ్, చిరు
అక్కినేని నాగేశ్వర్రావు శత జయంతిని ఘనంగా నిర్వహించేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ANR అవార్డ్స్-2024 ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇద్దరు మెగాస్టార్లు రానున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారిద్దరినీ ఆహ్వానించినట్లు నాగార్జున ప్రకటించారు. కార్యక్రమం ఈనెల 28న జరగనుంది. ANR నేషనల్ అవార్డు చిరు అందుకోనున్నారు.
News October 25, 2024
మరో రూ.300 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాం: మంత్రి
AP: పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ‘ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద నెట్వర్క్ ఆసుపత్రులకు మాజీ సీఎం జగన్ పెట్టిన రూ.2500కోట్ల బకాయిలలో మరో రూ.300 కోట్లు ఇవాళ చెల్లించాం. రాష్ట్రం అప్పుల నుంచి అభివృద్ధి వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తోంది’ అని ట్వీట్ చేశారు.
News October 25, 2024
జగన్ ఆస్తులతో షర్మిలకు సంబంధమేంటి?: వైసీపీ
AP: సీఎం చంద్రబాబు డైరెక్షన్లో విజయమ్మను ముందుపెట్టి జగన్ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ‘కుటుంబ ఆస్తులన్నింటినీ YSR జీవించి ఉన్నప్పుడే పంపకాలు చేసేశారు. కానీ చెల్లి షర్మిలపై ఉన్న ప్రేమాభిమానాలతో జగన్ తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లోనూ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చారు’ అని ట్వీట్ చేసింది. ‘శాడిస్ట్ చంద్రబాబు’ అని పేర్కొంది.