News November 23, 2024
చలి పులి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రంగా పెరిగిపోయింది. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సరిపడా నీరు, పౌష్ఠికాహారం తీసుకోవాలి. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విటమిన్ C ఉండే ఫుడ్ తీసుకోవాలి. చలి మంట కోసం ఇంట్లో కర్రలు కాల్చకూడదు. ఇలా చేస్తే కార్బన్ మోనాక్సైడ్ పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Similar News
News October 16, 2025
ట్రంప్కు మోదీ భయపడుతున్నారు: రాహుల్

US అధ్యక్షుడు ట్రంప్కు PM మోదీ భయపడుతున్నారని INC నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అందుకే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయదని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించినా ప్రధాని స్పందించడం లేదన్నారు. ‘ఈజిప్టులో జరిగిన పీస్ సమ్మిట్కు డుమ్మా కొట్టారు. ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. Op సిందూర్కు విరుద్ధంగా మాట్లాడినా ఊరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
News October 16, 2025
డిప్లొమా, ఐటీఐ అర్హతతో 186 పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)186 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు NOV 4 వరకు అప్లై చేసుకోవచ్చు.10 పోస్టులకు మాత్రం NOV 5 లాస్ట్ డేట్. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://bel-india.in/
News October 16, 2025
ఆంధ్రా వంటకాలే కాదు.. పెట్టుబడులూ స్పైసీ: లోకేశ్

AP: విశాఖతో పాటు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రా వంటకాలు స్పైసీ అంటారు. మా పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయి. కొంతమంది పొరుగువారు ఇప్పటికే ఆ మంట అనుభవిస్తున్నారు’ అని పేర్కొన్నారు. రెండ్రోజుల కిందట విశాఖలో గిగా వాట్ కెపాసిటీతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.