News January 28, 2025
తగ్గిన చలి.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో వచ్చే వారం రోజులపాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉదయం పొగమంచు తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు, రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తీవ్రత తగ్గిందని వివరించింది. అటు ఏపీలో మన్యం సహా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది.
Similar News
News November 8, 2025
రేపటి నుంచి మద్యం షాపులు బంద్: CP

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14న కౌంటింగ్ సందర్భంగా ఉ.6 నుంచి 15న ఉ.6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్నారు.
News November 8, 2025
₹60,799Crతో రోడ్ల నిర్మాణం.. రికార్డు: మంత్రి

TG: రాష్ట్రంలో ₹60,799Crతో రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెంకట్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని, RRR నిర్మాణానికి ₹36,000Cr, HYD-VJA హైవే విస్తరణకు ₹10,400కోట్లు, HAM ప్రాజెక్టుకు ₹11,399Cr కేటాయించామన్నారు. ₹8,000Crతో మన్ననూర్-శ్రీశైలం ఎలివేటర్ కారిడార్, ₹20,000Crతో ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో డబుల్ రోడ్లు వేస్తామన్నారు.
News November 8, 2025
మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే మొదలైన వర్షం పెద్దదైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో ఇండియా గెలిచింది.


