News December 18, 2024

చలి పులి.. ఆ జిల్లాలో స్కూళ్ల టైమింగ్స్ మార్పు

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉ.9.40 నుంచి సా.4.30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉ.9.15 నుంచి సా.4.15 వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. కాగా, తాము చలితో ఇబ్బందులు పడుతున్నామని, టైమింగ్స్ మార్చాలని పలు జిల్లాల విద్యార్థులు కోరుతున్నారు.

Similar News

News January 3, 2026

5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు

image

AP: ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో ఈ నెల 5 నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో 10.57 లక్షల మంది 17ఏళ్ల లోపు వారు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. నీట్, JEE పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని క్యాంపుల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లకు సూచించింది.

News January 3, 2026

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

image

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.

News January 3, 2026

ఇతిహాసాలు క్విజ్ – 116

image

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>