News August 26, 2024

రేపటి నుంచి రుణమాఫీ కాని వారి వివరాల సేకరణ

image

TG: అర్హులై రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు ‘రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలంది. కాగా రూ.2 లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామనేది ప్రభుత్వం వెల్లడించలేదు.

Similar News

News October 19, 2025

భారీ జీతంతో NMDCలో ఉద్యోగాలు

image

NMDC లిమిటెడ్ 14 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CGM, GM, డైరెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు OCT 21 ఆఖరు తేదీ కాగా.. డైరెక్టర్ పోస్టుకు OCT 27 లాస్ట్ డేట్. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్), PG, PG డిప్లొమా, MBA, MSc, ఎంటెక్, MSc జియోలజీ, CA/ICMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

News October 19, 2025

దీపావళికి ఇంటిని ఇలా డెకరేట్ చేసుకోండి

image

దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ రోజున మీ ఇల్లు దేదీప్యమానంగా మెరిసిపోయేందుకు LED లైట్లతో అలంకరించుకోవచ్చు. దీపాలను ఒక వరుసలో పెట్టడం కంటే దియా స్టాండ్లను వాడితే మంచి లుక్ వస్తుంది. గుమ్మానికి పూల తోరణాలతో పాటు హ్యాంగింగ్స్ వేలాడదీయాలి. ఇంటి ఆవరణలో చిన్నమొక్కలు ఉంటే వాటికి లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. పూలరంగోళీలు పండుగ శోభను మరింత పెంచుతాయి. పేపర్ లాంతర్లలో లైట్లను వేలాడదీస్తే ఇంకా బావుంటుంది.

News October 19, 2025

16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

image

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.