News November 10, 2024
త్వరలో కలెక్టర్ల సదస్సు

AP: శాసనసభ సమావేశాల అనంతరం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. తొలిసారి జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. కాగా రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్స్ 11 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
Similar News
News September 15, 2025
24 గంటల్లో 3 మ్యాచులు ఆడిన ప్రొటీస్ క్రికెటర్

దక్షిణాఫ్రికా క్రికెటర్ జోర్న్ ఫార్టూయిన్ ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే మూడు T20 మ్యాచులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. SEP 12న రా.6.30 గంటలకు మాంచెస్టర్లో ఇంగ్లండ్తో T20 మ్యాచ్ ఆడారు. 13న మ.2.30 గంటలకు బర్మింగ్హామ్లో జరిగిన T20 బ్లాస్ట్ సెమీఫైనల్లో హ్యాంప్షైర్ తరఫున పాల్గొన్నారు. హ్యాంప్షైర్ ఫైనల్కు దూసుకెళ్లడంతో ఆ వెంటనే రా.6.45 గంటలకు ఆ మ్యాచ్ కూడా ఆడేశారు.
News September 15, 2025
సమ్మె విరమించమని కోరాం: భట్టి

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.
News September 15, 2025
ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.