News March 25, 2025

నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

Similar News

News December 2, 2025

ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

image

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.

News December 2, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా?

News December 2, 2025

హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

image

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!