News October 18, 2024

పాక్ రండి.. మ్యాచ్ ఆడగానే వెళ్లిపోండి: PCB

image

తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేలా చేయడానికి PCB శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా BCCI ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది. పాక్‌లో ఉండటానికి భద్రతాపరమైన కారణాలు అడ్డొస్తున్నాయనుకుంటే IND ఆడే ప్రతి మ్యాచ్ తర్వాత తిరిగి చండీగఢ్ లేదా ఢిల్లీకి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు cricbuzz తెలిపింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ వెళ్లేది లేదని అంటున్న BCCI, PCB ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో?

Similar News

News January 1, 2026

రో-కో లేకపోతే వన్డేలు కష్టమే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

image

ప్రస్తుతం వన్డే క్రికెట్ పరిస్థితిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు రిటైరైతే ఈ ఫార్మాట్‌ను చూసేవారు తగ్గిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. T20లకు హవా పెరగడం, టెస్ట్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ODIలకు ఆదరణ తగ్గుతుందని అంచనా వేశారు.

News January 1, 2026

కొత్త లుక్‌లో నాని, అఖిల్.. పోస్టర్లు చూశారా?

image

న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’, అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ MAR 26న రిలీజ్ కానుంది. అటు ‘లెనిన్’ నుంచి ఈనెల 5న ఫస్ట్ సాంగ్‌ను, ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తామని మూవీ టీమ్ పేర్కొంది. మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News January 1, 2026

పాలమూరు ప్రాజెక్టుపై KCR, హరీశ్‌వి తప్పుడు ప్రచారాలు: ఉత్తమ్

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై సీఎం, మంత్రులకు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ప్రాజెక్టు పూర్తికి రూ.80వేల కోట్లు అవసరం. BRS ప్రభుత్వం రూ.27వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఆ పార్టీ నేతలు 90% పూర్తి చేశామని ఎలా చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.7వేల కోట్లు ఖర్చు చేశాం’ అని వివరించారు.