News October 24, 2024
బెంగళూరు నుంచి ఏపీకి వచ్చేయండి: నారా లోకేశ్

బెంగళూరులో డ్రైనేజీ, ట్రాఫిక్ ఐటీ కంపెనీల విస్తరణకు ఆటంకాలుగా మారాయని పారిశ్రామికవేత్త మోహన్దాస్ పాయ్ చేసిన ట్వీట్కు మంత్రి లోకేశ్ స్పందించారు. బెంగళూరును వదిలి APకి రావాలని, పెట్టుబడులు పెట్టే వారి కోసం 6 పాలసీలు సిద్ధం చేశామని తెలిపారు. ‘జగన్ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు కంపెనీలు స్థాపించేందుకు భయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా, ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది’ అని మోహన్ అన్నారు.
Similar News
News October 20, 2025
VJD మెథడ్ అంటే ఏంటి?

క్రికెట్ మ్యాచ్కు అంతరాయం కలిగినప్పుడు ఓవర్లు కుదించేందుకు, టార్గెట్ రివైజ్ చేసేందుకు డక్వర్త్ లూయిస్ స్టెర్న్(DLS) మెథడ్ ఉపయోగించడం తెలిసిందే. దీనికి బదులుగా వి.జయదేవన్ తన పేరుతో <<18055833>>VJD<<>> మెథడ్ కనిపెట్టారు. ఇందులో సాధారణ అంచనాతో పాటు మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక బ్యాటర్లు దూకుడుగా ఆడే అంశాన్నీ పరిగణించి టార్గెట్ సెట్ చేస్తారు. ఓవర్లు, వికెట్లతో పాటు రియల్ మ్యాచ్ కండీషన్స్నూ అంచనా వేసేలా డిజైన్ చేశారు.
News October 20, 2025
సదర్ ఉత్సవాల్లో కిషన్రెడ్డి సందడి

TG: HYD కాచిగూడలోని చప్పల్ బజార్లో యాదవుల సదర్ ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందడి చేశారు. ‘ఆల్ ఇండియన్ ఛాంపియన్ బుల్స్’కు స్వాగతం పలికారు. యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో ప్రతి పండుగ పవిత్రమైనదని, దున్న రాజుల ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక గర్వాన్ని ఈ వేడుకలు ప్రదర్శిస్తాయన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
News October 20, 2025
BREAKING: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డీఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.