News October 24, 2024
బెంగళూరు నుంచి ఏపీకి వచ్చేయండి: నారా లోకేశ్

బెంగళూరులో డ్రైనేజీ, ట్రాఫిక్ ఐటీ కంపెనీల విస్తరణకు ఆటంకాలుగా మారాయని పారిశ్రామికవేత్త మోహన్దాస్ పాయ్ చేసిన ట్వీట్కు మంత్రి లోకేశ్ స్పందించారు. బెంగళూరును వదిలి APకి రావాలని, పెట్టుబడులు పెట్టే వారి కోసం 6 పాలసీలు సిద్ధం చేశామని తెలిపారు. ‘జగన్ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు కంపెనీలు స్థాపించేందుకు భయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా, ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది’ అని మోహన్ అన్నారు.
Similar News
News November 23, 2025
భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.
News November 23, 2025
PNBలో 750 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. 20-30 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. https://pnb.bank.in/
News November 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 75

ఈరోజు ప్రశ్న: పాండవుల తరఫున యుద్ధం చేసిన దృతరాష్ట్రుని పుత్రుడు ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


