News January 3, 2025
హైందవ శంఖారావానికి తరలిరండి: VHP

AP: విజయవాడ కేసరపల్లి వద్ద JAN 5న జరిగే హైందవ శంఖారావం సభకు హిందువులు తరలిరావాలని VHP పిలుపునిచ్చింది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో 30 ఎకరాల్లో భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వాలు హిందూ ఆలయాలను తమ అధీనంలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయని VHP నేత గోకరాజు గంగరాజు మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాల కోసం పోరాటం చేస్తామన్నారు.
Similar News
News October 18, 2025
అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.
News October 18, 2025
దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

TG: దీపావళి పండుగకు 2 రోజుల ముందు వచ్చిన ‘రాష్ట్ర బంద్’ పండుగ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వారాంతం కూడా కావడంతో ప్రజలు దీపావళి షాపింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. వస్త్ర, గోల్డ్, స్వీట్స్ దుకాణదారులు ఇవాళ భారీ వ్యాపారాన్ని ఆశించారు. కానీ బీసీ సంఘాల బంద్ పిలుపుతో జనం రాక తగ్గి బిజినెస్పై ఎఫెక్ట్ పడుతుందని వారు ఆందోళనలో ఉన్నారు. బంద్ ప్రభావం ఎంతో సాయంత్రానికి క్లారిటీ వస్తుంది.
News October 18, 2025
నేడు ఈ వ్రతం చేస్తే బాధల నుంచి విముక్తి

శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని నేడు ఆచరిస్తే అపారమైన ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు, ఉద్యోగాభివృద్ధి కోరేవారు ఈ వ్రతం చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరిగి, దారిద్య్రం తొలగి, అన్నింటా విజయం లభిస్తుందంటున్నారు. ధనాదిదేవత లక్ష్మీదేవి, ధనాధ్యక్షుడు కుబేరుని ఆశీస్సులతో శుభం కలుగుతుందంటున్నారు.