News September 10, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈనెల 1న ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.

Similar News

News January 28, 2026

ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ

image

AP: పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెల పెన్షన్‌ను జనవరి 31వ తేదీనే పంపిణీ చేయనుంది. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జనవరి 30నే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే.

News January 28, 2026

రిటైర్మెంట్ వెనుక కారణం చెప్పిన అర్జిత్ సింగ్

image

బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు <<18977435>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త తరం గాయకులకు అవకాశాలు కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. సినిమాలకు గుడ్‌బై చెప్పినా, ఇండిపెండెంట్ సింగర్‌గా తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

News January 28, 2026

అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

image

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.