News April 5, 2024

ఎలక్టోరల్ బాండ్లతో SBIకి రూ.10.68కోట్ల కమీషన్!

image

ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా SBI భారీగా లబ్ధి పొందినట్లు RTI ద్వారా వెల్లడైంది. 2018-2024 మధ్య జరిగిన ఈ బాండ్ల లావాదేవీలపై SBI ఛార్జీలు వసూలు చేసిందట. మొత్తం రూ.10.68కోట్లు తమకు కమీషన్‌గా చెల్లించాలని కేంద్ర ఆర్థికశాఖకు బిల్లు పంపించింది. కనిష్ఠంగా 82 బాండ్లు క్లెయిమ్ చేసుకున్నందుకు రూ.1.82లక్షలు వసూలు చేసింది. గరిష్ఠంగా 2019 ఎన్నికల టైమ్‌లో 4,607 బాండ్లు సేల్ అయినందుకు రూ.1.25కోట్లు వసూలు చేసింది.

Similar News

News October 18, 2025

APకి కొత్తగా 106 PG మెడికల్ సీట్లు: సత్యకుమార్ యాదవ్

image

AP: ప్రభుత్వ PG వైద్య విద్యలో అదనంగా 106 సీట్ల భర్తీకి NMC ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గైనిక్, పీడియాట్రిక్, ఎనస్థీషియా, రేడియాలజీ విభాగాల్లో ఈ సీట్లున్నాయి. ఇందులో 60 సీట్లు 5 కొత్త కాలేజీలకు వస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం అదనపు సీట్ల మంజూరుకు ప్రతిపాదన పంపింది. దీనిపై మంత్రి సత్యకుమార్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడారు. దీంతో కొత్త మెడికల్ సీట్లు మంజూరయ్యాయి.

News October 18, 2025

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త!

image

ఇవాళ్టి నుంచి దీపావళి టపాసుల మోత మోగనుంది. ఈ సందర్భంగా పిల్లలపై పెద్దలు ఓ కన్నేసి ఉంచడం మేలు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్‌వి ధరించాలి. కాలికి చెప్పులు లేదా బూట్లు ధరించాలి. క్రాకర్స్‌ను చేతిలో పట్టుకుని కాల్చకుండా, సురక్షితమైన దూరం పాటించాలి. కాల్చిన లేదా సగం కాలిన టపాసులను ముట్టుకోకూడదు. వాటిపై నీరు పోసి పారేయాలి. గడ్డివాములు, గుడిసెల దగ్గర అస్సలు పేల్చకూడదు.

News October 18, 2025

68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్

image

TG: మద్యం దుకాణాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులు బారులు తీరారు. వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 68,900 అప్లికేషన్ల ద్వారా రూ.2,067 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 30 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయం రూ.3 వేల కోట్లు దాటనుంది. గతంలో 1.03 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,600 కోట్లు వచ్చాయి.