News April 5, 2024
ఎలక్టోరల్ బాండ్లతో SBIకి రూ.10.68కోట్ల కమీషన్!

ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా SBI భారీగా లబ్ధి పొందినట్లు RTI ద్వారా వెల్లడైంది. 2018-2024 మధ్య జరిగిన ఈ బాండ్ల లావాదేవీలపై SBI ఛార్జీలు వసూలు చేసిందట. మొత్తం రూ.10.68కోట్లు తమకు కమీషన్గా చెల్లించాలని కేంద్ర ఆర్థికశాఖకు బిల్లు పంపించింది. కనిష్ఠంగా 82 బాండ్లు క్లెయిమ్ చేసుకున్నందుకు రూ.1.82లక్షలు వసూలు చేసింది. గరిష్ఠంగా 2019 ఎన్నికల టైమ్లో 4,607 బాండ్లు సేల్ అయినందుకు రూ.1.25కోట్లు వసూలు చేసింది.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


