News July 22, 2024

రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్

image

AP: విభజన వల్ల రాష్ట్రానికి నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014-2019 మధ్య రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగింది. ఆ తర్వాత YCP అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. పెట్టుబడులు పక్కదారి పట్టాయి. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది’ అని వివరించారు.

Similar News

News December 25, 2025

మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి వర్ధంతి నేడు.!

image

బద్వేల్ మండలంలోని చెన్నకేశం పల్లె అనే గ్రామంలో జన్మించిన బిజీ వేముల వీరారెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన కడప జిల్లా టీడీపీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించి బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశాడు. ఇప్పటికి ఆయన మరణించి 25 సంవత్సరాలు అవుతోంది.

News December 25, 2025

నల్గొండ: నిధుల వినియోగంలో పారదర్శకత: మంత్రి ఉత్తమ్

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వెచ్చించిన ప్రతి పైసాకు లెక్క చెబుతామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని, అందులో 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ​గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు.

News December 25, 2025

నల్గొండ: నిధుల వినియోగంలో పారదర్శకత: మంత్రి ఉత్తమ్

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వెచ్చించిన ప్రతి పైసాకు లెక్క చెబుతామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని, అందులో 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ​గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు.