News July 22, 2024
రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్

AP: విభజన వల్ల రాష్ట్రానికి నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014-2019 మధ్య రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగింది. ఆ తర్వాత YCP అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. పెట్టుబడులు పక్కదారి పట్టాయి. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది’ అని వివరించారు.
Similar News
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 22, 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <
News November 22, 2025
అద్దం పగిలితే అపశకునమా?

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.


