News August 22, 2024

పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ: సీఎం చంద్రబాబు

image

AP: పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. రెడ్ కేటగిరీ పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. పరిశ్రమల అనుబంధ శాఖలన్నీ ఉమ్మడిగా పనిచేయాలి. అన్ని శాఖలు ఒకేసారి తనిఖీలు నిర్వహించాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాం. ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవు’ అని అచ్యుతాపురం ఘటనపై వ్యాఖ్యానించారు.

Similar News

News July 11, 2025

రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

image

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్‌గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.

News July 11, 2025

నాకు ప్రాణ హాని ఉంది: ట్రంప్

image

ట్రంప్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి <<17014894>>జావద్ లారిజనీ<<>> చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘జావద్ లారిజనీ హెచ్చరికలను బెదిరింపులుగానే భావిస్తున్నాను. నా ప్రాణాలకు హాని ఉంది అనే వార్తల్లో సందేహం లేదు. నిజానికి నేను ఏడేళ్ల వయసు నుంచే సన్ బాత్ చేయడం మానేశాను’ అని వ్యాఖ్యానించారు. ఆ సమాధానం చూస్తే ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

News July 11, 2025

శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా పడింది. <<16831702>>యాక్సియం-4<<>> మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన నలుగురు సభ్యులు ఈ నెల 14న భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. 14 రోజుల యాత్ర కోసం జూన్ 25న ఈ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇవాళే వారు తిరిగి రావాల్సి ఉండగా వాయిదా పడింది. స్పష్టమైన కారణాలేంటో నాసా వెల్లడించలేదు.