News September 17, 2024
గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కమిటీ

TG: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్లో మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘ప్రవాసీ ప్రజావాణి’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
Similar News
News September 7, 2025
చంద్రుడిని చూశారా?

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగులు ప్రసరిస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతున్న చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే దేశ ప్రజలు ధగధగా మెరుస్తున్న చంద్రుడిని చూస్తూ పులకరిస్తున్నారు. మరి మీరు చందమామను చూశారా?
News September 7, 2025
మెట్రో టెండర్ల గడువు పొడిగింపు

AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువు పొడిగించినట్లు AP మెట్రో రైల్ కార్పొరేషన్ MD రామకృష్ణారెడ్డి తెలిపారు. VJA మెట్రో టెండర్ల గడువు అక్టోబరు 14, విశాఖకు సంబంధించి అక్టోబరు 7వరకు పొడిగించామన్నారు. టెండర్ల ప్రీబిడ్ సమావేశంలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వినతులు రాగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23KM, VJA మెట్రో ఫేజ్-1లో 38KM నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.
News September 7, 2025
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో PM మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. US దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్యసాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మనముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని US ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడంలేదన్నారు.