News March 31, 2024
విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ

AP: విశాఖ(D) కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై సాంకేతిక విద్యాశాఖ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. అధ్యాపకుని లైంగిక వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తండ్రికి విద్యార్థిని మెసేజ్ పెట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. కాలేజీలో చాలా మంది వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆ సందేశంలో పేర్కొంది. దీంతో విద్యాశాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది.
Similar News
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్లో ఇంగ్లండ్పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్లో న్యూజిలాండ్తో పోటీ పడుతుంది.
News March 5, 2026
బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్తో US, ఇరాన్ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.
News March 5, 2026
బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఏమన్నారంటే?

బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడం షాక్కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘ఆయన రిజైన్ వెనుక కారణం తెలియదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసి ఉంటారు. ఎన్.రవిని WB గవర్నర్గా నియమిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నాతో చర్చించలేదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి’ అని ట్వీట్ చేశారు.


