News September 9, 2025
ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై కమిటీ: SEC సాహ్ని

AP: ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిందని SEC నీలం సాహ్ని తెలిపారు. ‘S-3 మోడల్ ఈవీఎంలో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. 10,670 M-2 మోడల్ ఈవీఎంలు ఇప్పటికే మనవద్ద ఉన్నాయి. ఒకవేళ ఈవీఎంలు అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 5, 2026
కారుణ్య నియామకానికి ఏడాదిలోపే అప్లై చేయాలి: HC

TG: ఉద్యోగి మరణించిన ఏడాదిలోపే కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం కోసం అప్లై చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఏడాది తర్వాత దరఖాస్తు చేస్తే ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉంటేనే నియామకం వర్తిస్తుందని చెప్పింది. ఉద్యోగి భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, కుటుంబం ఆర్థికంగా బాగున్నా కారుణ్య నియామకానికి అర్హులు కారని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా పేర్కొంది.
News April 5, 2026
IPL: ఇప్పటి వరకు వీళ్లే టాప్!

IPL-19లో ఇప్పటి వరకు 9మ్యాచులు జరగ్గా పలువురు యంగ్ క్రికెటర్లు సత్తా చాటారు. DC ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆడిన 2 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో 160పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో రోహిత్(113), కూపర్(108), రఘువంశీ(103) ఉన్నారు. ఇక రవి బిష్ణోయ్(RR) 5 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నారు. వైశాఖ్ విజయ్ కుమార్ సైతం 5 వికెట్లు పడగొట్టినా ఎకానమీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు.
News April 5, 2026
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదు: హైకోర్టు

AP: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదంటూ ఓ అర్చకుడు కోర్టులో పిటిషన్ వేశారు.


