News August 9, 2024

సరిహద్దుల్లో పరిస్థితులపై పర్యవేక్షణకు కమిటీ: కేంద్రం

image

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పరిస్థితులపై పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఆ దేశంలోని హిందువులు, భారతీయుల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. అటు అక్కడి హింసాత్మక ఘటనల దృష్ట్యా పలువురు భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు.

Similar News

News December 3, 2025

డాలర్ విలువ పెరిగితే మనకు ఎలా భారం..?

image

డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం సామాన్యుడికి ఆర్థిక భారం. ఫారిన్ దిగుమతులకు డాలర్ రూపంలో డబ్బు చెల్లించాలి. దీంతో మనం ఎక్కువ పే చేయాలి. 90% క్రూడ్, కొన్ని వంట నూనెలు విదేశాల నుంచే వస్తాయి. సెమీ కండక్టర్స్, చిప్స్ లాంటి ఇంపోర్టెడ్ విడి భాగాలతో తయారయ్యే ఫోన్స్, ల్యాప్‌టాప్స్, రిఫ్రిజిరేటర్స్ ధరలు, ఫారిన్లో మన విద్యార్థులకు పంపాల్సిన ఫీజులు పెరుగుతాయి.
Ex: ఓ $1 వస్తువు.. మనకు గతంలో ₹80, నేడు ₹90.

News December 3, 2025

మహిళా అభివృద్ధి&శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

image

TG: పెద్దపల్లి జిల్లాలోని మహిళా అభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 16 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, డిగ్రీ, LLB, ANM, GNM, MBBS, BAMS, BHMS, BSc(నర్సింగ్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, CWO, పారా మెడికల్ స్టాఫ్, నర్సు, ANM, సోషల్ వర్కర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: peddapalli.telangana.gov.in/

News December 3, 2025

చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా?

image

చిన్న వయసులోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని USకు చెందిన NIH (National Institutes of Health) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 10,000 మందికి పైగా పిల్లలపై స్టడీ చేయగా.. 12 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఫోన్‌కు అలవాటు పడిన వారిలో డిప్రెషన్‌, నిద్రలేమి, ఒబేసిటీ, అలసట వంటి సమస్యలు పెరిగినట్లు గుర్తించింది. ఫోన్‌లో ఏం చేస్తారన్నది కాదని.. అది కలిగి ఉండటమే ప్రమాదకరమని హెచ్చరించింది.