News August 19, 2024

26000 ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీలు

image

రిటైల్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. FY24లో 12 లైఫ్‌స్టైల్, గ్రాసరీ, క్విక్‌సర్వీస్ రెస్టారెంట్లు దాదాపుగా 26వేల మందిని తొలగించాయి. రిలయన్స్, టైటాన్, పేజ్, రేమండ్, స్పెన్సర్ మొత్తం వర్క్‌ఫోర్స్ FY23లో 455000 ఉండగా FY24లో 429000కు తగ్గింది. కస్టమర్లు ఫ్యాషన్ దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లను తగ్గించడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Similar News

News November 28, 2025

నేటి నుంచి వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడతాయని వివరించింది. నేడు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

News November 28, 2025

అమ్మానాన్నల మీద నిందలు వేస్తున్నారా..?

image

మాతృ నింద మహా వ్యాధిః పితృ నింద పిశాచతః
దైవ నింద దరిద్ర స్యాత్ గురు నింద కుల క్షయం
ఈ శ్లోకం ప్రకారం.. తల్లిని నిందించే వారికి వ్యాధులు కలుగుతాయి. తండ్రిని నిందిస్తే పిశాచత్వం ప్రాప్తిస్తుంది. దైవ నిందతో దరిద్రులవుతారు. అలాగే గురువును నిందించినట్లయితే వంశమే నాశనం అవుతుందట. అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పే గురువులను, లోకాన్ని సృష్టించిన దైవాన్ని ఎప్పుడూ నిందించకూడదని అంటారు.

News November 28, 2025

WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్ల హవా

image

WPL మెగా వేలంలో తెలుగు ప్లేయర్లను అదృష్టం వరించింది. కరీంనగర్(D) రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను UP రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75లక్షలకు RCB, త్రిష UP, క్రాంతిరెడ్డి MI, మమత కోసం DC రూ.10 లక్షల చొప్పున వెచ్చించాయి.