News March 25, 2025
పంట నష్టానికి త్వరలో పరిహారం: మంత్రి తుమ్మల

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పంట నష్టం వివరాలు సేకరించేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక రాగానే పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2026
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు!

TG: రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో <<19171673>>ఫీజులు పెరిగాయి<<>>. ప్రస్తుత, వచ్చే విద్యా సంవత్సరాలకు సంబంధించి 160 కాలేజీల ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. TAFRC సిఫార్సుల మేరకు అత్యల్పంగా ₹45 వేలు, అత్యధికంగా ₹1.83 లక్షలుగా నిర్ణయించింది. CBIT(₹1.83 లక్షలు), వాసవి(₹1.75 లక్షలు), MGIT(1.67 లక్షలు), CVR(₹1.63 లక్షలు)లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. 35కు పైగా కాలేజీల్లో ₹లక్షకు పైనే ఉండటం గమనార్హం.
News March 6, 2026
రష్యా క్రూడాయిల్ వచ్చేస్తోంది!

అమెరికా <<19308509>>ఆంక్షల సడలింపు<<>>తో రష్యా నుంచి భారీగా ముడి చమురు ఇండియాకు రానుంది. 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు భారత తీరానికి దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవి వారంలో మన పోర్టులకు చేరుకోవచ్చని బ్లూమ్బర్గ్ డేటా చెప్పింది. సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలోనే వస్తాయని వివరించింది. US నుంచి సిగ్నల్ రాకముందే రష్యా ట్యాంకర్లు ఇండియా వైపు మళ్లాయని తెలుస్తోంది.
News March 6, 2026
దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.


