News March 25, 2025

పంట నష్టానికి త్వరలో పరిహారం: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పంట నష్టం వివరాలు సేకరించేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక రాగానే పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 14, 2026

మరో 2 కిలోలు తగ్గడమే లక్ష్యమంటున్న లోకేశ్

image

AP: మంత్రి లోకేశ్ ఇటీవల మరింత వెయిట్ లాసై ఫిట్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘బరువు మరీ ఎక్కువ తగ్గుతున్నానని అంతా అంటున్నారు. కానీ ఇంకో 2 కిలోలు తగ్గితే నా లక్ష్యం పూర్తవుతుంది. అటు రోజూ కొంతమంది నేతలతో డిన్నర్ చేసి వాళ్ల బాగోగులు తెలుసుకోవడం PM మోదీ నుంచి నేర్చుకున్నా. క్వాంటం, AI సీఎం చూసుకుంటారు. నేను మానవీయ సంబంధాలు చూసుకుంటా’ అని అసెంబ్లీ లాబీలో నేతలతో లోకేశ్ అన్నారు.

News February 14, 2026

40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

image

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ క‌చ్చితంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్ల‌కు పైబ‌డిన త‌రువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిల‌గ‌డదుంప‌లు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

News February 14, 2026

IND vs PAK: హ్యాండ్ షేక్‌పై పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

image

T20 WCలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ‘హ్యాండ్‌ షేక్’ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. Asia Cupలో టీమ్ ఇండియా ప్లేయర్లు పాక్‌తో కరచాలనం చేయకపోవడం పెద్ద దుమారమే రేపింది. దాన్ని గుర్తు చేస్తూ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటిలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, నిర్ణయం భారత్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.