News March 25, 2025

పంట నష్టానికి త్వరలో పరిహారం: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పంట నష్టం వివరాలు సేకరించేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక రాగానే పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.

Similar News

News March 7, 2026

విజయ్‌‌కి భార్య షాక్.. కోర్టులో మరో పిటిషన్!

image

టీవీకే అధినేత విజయ్‌కి ఆయన భార్య సంగీత <<19295692>>మరోసారి<<>> షాక్ ఇచ్చారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని అందులో కోరారు. ‘చెన్నై నీలంకరైలోని ఇంట్లో నాకూ సగం వాటా ఉంది. విడాకుల కేసు ముగిసే వరకు, నేను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలి’ అని తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.

News March 7, 2026

సుప్రీంలీడర్‌ను ఇరాన్ కావాలనే ప్రకటించట్లేదా?

image

ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తాబాను నియమించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వాటిలో <<19297127>>నిజం లేదని<<>> అక్కడి ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో సుప్రీంలీడర్ నియామకంపై ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొజ్తాబాను ప్రకటిస్తే చంపేస్తారనే భయంతో సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఎవరిని ఎన్నుకున్నా అంతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడం, కొత్తగా <<19290160>>బాధ్యతలు చేపట్టిన<<>> పలువురిని చంపడం తెలిసిందే.

News March 7, 2026

VIRAL: సిస్టర్‌తో సీఎం నితీశ్

image

ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న బిహార్ సీఎం నితీశ్‌ సోదరి సామాన్య జీవనం గడపడం విశేషమే. కుర్చీలో కూర్చుంటే కోట్లు కూడబెట్టే కాలమిది. కానీ 20 ఏళ్లుగా సీఎంగా ఉన్నా.. ఆయన కూడా ఆస్తులు వెనకేసుకోలేదు. నితీశ్ ఆస్తులు రూ.1.66 కోట్లే. హోలీ రోజు తన అక్క ఉషా దేవిని ఆయన కలిసిన ఫొటో వైరలవుతోంది. పీఎం మోదీ, యూపీ సీఎం యోగి కుటుంబీకులు సైతం ఇలాగే నిరాడంబరంగా ఉండటం విశేషం.