News September 10, 2024

అలాంటి వాహనాలకే పరిహారం: బీమా సంస్థలు

image

AP: విజయవాడ వరదల్లో ముంపునకు గురైన వాహనాలకు బీమా క్లెయిమ్‌లు వారంలోగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ముంపునకు గురయ్యే నాటికి ఆ వాహనాల బీమా చలామణిలో ఉంటేనే పరిహారం అందుతుందని బీమా కంపెనీలు చెబుతున్నాయి. గడువు ముగిసినా, సకాలంలో రెన్యూవల్ చేసుకోకపోయినా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తీసుకున్నా క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నాయి. కాంప్రహెన్సివ్/ప్యాకేజీ పాలసీ తీసుకుని ఉండాలని అంటున్నాయి.

Similar News

News November 20, 2025

త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

image

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్‌కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్‌లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.

News November 20, 2025

TMC-HBCHలో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>TMC<<>>-హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్& రీసెర్చ్ సెంటర్ 2 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి DMLT/ డిగ్రీ(MLT)/ బీఎస్సీ(హిమటాలజీ)/ ఎంఎస్సీ (ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు ఈనెల 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://tmc.gov.in/

News November 20, 2025

శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

image

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్‌ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.