News October 12, 2025

తురకపాలెం మృతుల కుటుంబాలకు పరిహారం

image

AP: గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో మరణించిన వారి కుటుంబాలకు నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుంది. మృతుల్లో ఎక్కువ మంది పేదలుండటంతో ఆదుకోవాలని CM చంద్రబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనపై స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మొత్తం 28 కుటుంబాలకు నేడు పెమ్మసాని పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నారు.

Similar News

News October 12, 2025

అనుబంధాల ఆలయమే పెళ్లి

image

పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఏడడుగుల అనుబంధం. ఏడు జన్మల అనురాగం. ఇది రెండు మనసుల పవిత్ర కలయిక. ఇరువురి జీవితాల ప్రేమానురాగాల అల్లిక. తల్లిదండ్రులను మురిపించి, రెండు కుటుంబాల సంతృప్తిని కొనసాగించే గొప్ప సంస్కారం. శాంతి సౌభాగ్యాల ఉద్భవానికి, ‘నా’ అనే తీయని భావనతో కుటుంబాన్ని ఏర్పాటుచేసుకొనే మొదటి సోపానం. ఓర్పు, సహనం అనే పునాదులపై నిర్మితమయ్యే అందమైన అనుబంధాల సౌధమే వివాహం. <<-se>>#Pendli<<>>

News October 12, 2025

బిగ్ బాస్‌-9లోకి దువ్వాడ సన్నిహితురాలు

image

AP ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధవి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోరినట్లు దువ్వాడ చెప్పారు. ‘ఇప్పటివరకు బిగ్ బాస్ ఒక లెక్క. ఈ రోజు నుంచి బిగ్ బాస్ 2.0 చూడబోతున్నారు’ అని అన్నారు. మరి ఒక్కరికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా? అనేది ఇవాళ 9pmకు క్లారిటీ రానుంది. అటు ఈ వారం ఇద్దరు ఎలిమినేటర్ అవుతారని సమాచారం.

News October 12, 2025

3,073 SI పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

SSC 3,073 SI పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. వీటిలో ఢిల్లీలో 212, CAPF’sలో 2,861 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతగల అభ్యర్థులు OCT 16 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. రాతపరీక్ష, PST/PET, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ssc.gov.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.