News April 4, 2024

మృతుల కుటుంబాలకు రూ.40లక్షల చొప్పున పరిహారం

image

TG: నిన్న సంగారెడ్డి జిల్లాలోని SB కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు <<12982731>>ఘటనలో<<>> మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.40 లక్షలు చెల్లించేలా మంత్రి దామోదర రాజనర్సింహా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కుటుంబంలో ఒకరికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా ఒప్పించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.

Similar News

News November 21, 2025

రేపు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్ష సూచన.!

image

దక్షిణ అండమాన్‌లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది.

News November 21, 2025

మూవీ ముచ్చట్లు

image

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్‌బాస్ సీజన్-12పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్‌లో టాక్

News November 21, 2025

ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.