News March 21, 2024
‘మాజీ జవాన్కు రూ.50లక్షల పరిహారం’.. సైన్యానికి సుప్రీం ఆదేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710840882083-normal-WIFI.webp)
తప్పుడు కారణంతో ఉద్యోగం కోల్పోయిన మాజీ జవాన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రూ.50 లక్షల పరిహారం సహా పెన్షన్ అందించాలని సైన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. కాగా 2001లో హవల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఆ జవాన్కు మిలిటరీ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో HIV ఉన్నట్లు తప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఫలితంగా ఆయనను విధుల్లోంచి తొలగించారు. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించగా ఈ మేరకు తీర్పునిచ్చింది.
Similar News
News July 5, 2024
ప్రపంచ కప్ హీరోలకు మహారాష్ట్ర బొనాంజా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720183593471-normal-WIFI.webp)
ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేకు మహారాష్ట్ర సర్కార్ రూ.11 కోట్ల నజరానా ప్రకటించింది. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో వీరందరినీ సీఎం ఏక్నాథ్ షిండే శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం కెప్టెన్ రోహిత్ సభలో ప్రసంగించారు.
News July 5, 2024
MLCలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720182499948-normal-WIFI.webp)
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.
News July 5, 2024
సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తా: CBN
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720182877886-normal-WIFI.webp)
TG CM రేవంత్ రెడ్డితో భేటీపై AP CM చంద్రబాబు స్పందించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమన్నారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. CBNకు స్వాగతం పలికేందుకు TDP శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.