News March 17, 2024

ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: జగదీశ్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.50వేలు, మిరప తోటలకు ఎకరాకు రూ.80వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఇదే సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు జలకళతో కళకళలాడాయని, ఇప్పుడు వెలవెలబోతున్నాయని చెప్పారు.

Similar News

News December 12, 2025

OTTలోకి రెండు కొత్త సినిమాలు

image

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ’12A రైల్వే కాలనీ’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. అటు దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ నటించిన ‘కాంత’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా NOV 14న విడుదలవగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

News December 12, 2025

AAIలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<>AAI<<>>) 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు నేటి నుంచి JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/

News December 12, 2025

‘అఖండ-2’ నిర్మాతలు, BMSపై హైకోర్టు ఆగ్రహం

image

‘అఖండ-2’ నిర్మాతలు, బుక్ మై షో సంస్థపై హైకోర్టు ఆగ్రహించింది. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు?’ అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకున్నారని BMS నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అటు ధరల పెంపు GO రద్దుపై ఈ మూవీ నిర్మాతలు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.