News September 25, 2024

రెండు రోజుల్లో రైతులకు పరిహారం

image

TG: అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రెండు రోజుల్లో రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. పంట నష్టానికి సంబంధించి జిల్లాల నుంచి నివేదికలు రావాల్సి ఉందని, కేంద్రం నుంచి ఇప్పటివరకు వరద సాయం అందలేదని మంత్రి చెప్పారు. తక్షణ సాయంగా రూ.10వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల తాము కోరినట్లు ఆయన తెలిపారు.

Similar News

News December 9, 2025

పిల్లలు మొండిగా చేస్తున్నారా?

image

కొందరు పిల్లలు ఊరికే అలుగుతుంటే వారిని తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమై నంత వరకు వారిని బుజ్జిగిస్తూ, దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి. కానీ చేయి చేసుకోవడం, తిట్టడం వల్ల మాట వినరంటున్నారు నిపుణులు. వారిని ప్రేమతో పెంచాలి. ఇంట్లో ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు మొండితనం వీడతారని చెబుతున్నారు.

News December 9, 2025

ప్రియురాలి వీడియో వైరల్.. హార్దిక్ పాండ్య ఆగ్రహం

image

బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా తన ప్రియురాలు మహికా శర్మను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయగా అవి వైరలయ్యాయి. దీంతో చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజారడం సరికాదని ఇన్‌స్టాలో పాండ్య ఫైరయ్యారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. ఇకపై ఫొటోలు తీసేటప్పుడు మైండ్‌ఫుల్‌గా ప్రవర్తించాలన్నారు.

News December 9, 2025

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అసిమ్‌ మునీర్

image

పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా నియమితులైన అసిమ్‌ మునీర్ మరోసారి భారత్‌ లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే పాక్ ప్రతిస్పందన ఈసారి మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా అణుబాంబు బెదిరింపులు సహా గతంలో కూడా <<18043029>>మునీర్‌<<>> ఇలాంటి కామెంట్స్ చేశారు.