News January 11, 2025
బాధితులకు రేపు పరిహారం: బీఆర్ నాయుడు

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలు, గాయపడ్డ బాధితులకు రేపటి నుంచి టీటీడీ పరిహారం అందించనుంది. టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాశ్ రెడ్డి APలో.. మిగతా వారు తమిళనాడు, కేరళలో పర్యటించి పరిహారం అందిస్తారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.2లక్షలు ఇస్తారు.
Similar News
News March 1, 2026
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత.. PM మోదీ కీలక భేటీ

ప్రధాని మోదీ కాసేపట్లో ఢిల్లీలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS)తో మీటింగ్ నిర్వహించనున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్-US యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల రాజస్థాన్, తమిళనాడు పర్యటన అనంతరం PM మోదీ కొద్దిసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. కాగా CCS దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
News March 1, 2026
ఈ నెల 4న ‘విరోష్’ రిసెప్షన్.. వారికే అనుమతి!

విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ ఈ నెల 4న HYDలో జరగనుంది. వాలిడ్ ఇన్విటేషన్ ఉన్నవారినే అనుమతించనున్నట్లు ‘విరోష్’ జోడి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ‘భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనతో గెస్ట్ లిస్ట్ను కుదించాం. దయచేసి ఇన్విటేషన్ లేని వారు ఈవెంట్ ప్లేస్కి రావొద్దు. ఎలాంటి అంతరాయం లేకుండా రిసెప్షన్ జరిగేందుకు సహకరించండి’ అని కోరింది. కాగా ఈరోజు CM రేవంత్ను రష్మిక రిసెప్షన్కు ఆహ్వానించారు.
News March 1, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

చెన్నైలోని<


