News November 25, 2024
పోటీపడి జలవిద్యుదుత్పత్తి.. అడుగంటుతున్న శ్రీశైలం జలాలు

శ్రీశైలం జలాశయం నుంచి AP, TG పోటీ పడి జలవిద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMCలు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలిఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా AP, TG పట్టించుకోవట్లేదు. ఇలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News February 15, 2026
చెరకు పంట నరికేటప్పుడు ఇలా చేస్తే మేలు

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.
News February 15, 2026
పరమ భక్తుడు ‘సిరియాళుడు’

సిరియాళుడు ప్రతిరోజు ఓ శివ భక్తుడికి భోజనం పెట్టిన తర్వాతే తను తినేవాడు. ఆయన భక్తిని పరీక్షించడానికి శివుడు ఓ వృద్ధుడి రూపంలో వచ్చి సిరియాళుడి ఏకైక కుమారుడిని వండి వడ్డించమని అడుగుతాడు. భక్తి కోసం సిరియాళుడు ఆ కఠినమైన పనికి అంగీకరిస్తాడు. ఆ దంపతుల నిశ్చల భక్తికి మెచ్చిన పరమశివుడు, వారి కుమారుడిని తిరిగి బ్రతికించి, ఆ కుటుంబం మొత్తానికి మోక్షాన్ని ప్రసాదించాడు. నిస్వార్థ భక్తికి ఆయన నిదర్శనం.
News February 15, 2026
నేషనల్ ఆయుష్ మిషన్లో ఉద్యోగాలు

నేషనల్ ఆయుష్ మిషన్(<


