News June 4, 2024

2 చోట్ల పోటీ.. కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లంటే?

image

AP: ‘పాల్ రావాలి-పాలన మారాలి’ అనే నినాదంతో ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను ఓటర్లు పట్టించుకోలేదు. కుండ గుర్తుకు ఓటేయాలని 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆయనకు ఆశించిన ఓట్లు పడలేదు. గాజువాక MLA అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఇప్పటివరకు 394 ఓట్లు రాగా, విశాఖ MP అభ్యర్థిగా నిలిచిన పాల్‌కు 1190 ఓట్లు లభించాయి. దీంతో పాల్ కుండ పగిలిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లు: పార్థసారథి

image

AP: ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు కట్టివ్వాలన్న లక్ష్యంలో ఇప్పటికే 3 లక్షలు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘ఇళ్లులేని నిరుపేదలకు 2029కల్లా శాశ్వత గృహ వసతి కల్పిస్తాం. వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లను పూర్తి చేస్తాం. ఉగాదికి 5 లక్షలు, జూన్‌కి మరో 87వేల గృహాలను పూర్తి చేయాలని పని చేస్తున్నాం. CM ఆదేశాల మేరకు 3 నెలలకోసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’ అని తెలిపారు.

News November 25, 2025

ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

image

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.

News November 25, 2025

అరుణాచల్ మా భూభాగం: చైనా

image

షాంఘై ఎయిర్‌పోర్టులో భారత మహిళను <<18373970>>వేధించారన్న<<>> ఆరోపణలను చైనా ఖండించింది. ‘ఎలాంటి నిర్బంధం, వేధింపులకు ఆమె గురి కాలేదు. చట్టాలు, రూల్స్‌కు అనుగుణంగానే అధికారులు వ్యవహరించారు. రెస్ట్ తీసుకునేందుకు చోటిచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. జాంగ్‌నాన్(అరుణాచల్) చైనా భూభాగం. ఇండియా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను మేం ఎప్పుడూ గుర్తించలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.