News August 20, 2024

CM రేవంత్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

image

TG: సీఎం రేవంత్‌రెడ్డిపై BRS నేతలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉండి ఆయన అభ్యంతరకర భాష మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, ముఠా గోపాల్ కోరారు. అధికారం శాశ్వతం కాదని, సీఎం రేవంత్ తీరును ప్రజలు గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Similar News

News January 29, 2026

మొక్కజొన్న పంటలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మొక్కజొన్న పైరు ఒకవేళ 60 నుంచి 65 రోజుల దశలో ఉంటే పంటకు అవసరం మేర ఎరువులను అందించాలి. ఈ సమయంలో చివరి దఫా నత్రజని ఎరువుగా ఎకరాకు 50 కిలోల యూరియా మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. పూత దశకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో పైరుకు నీటి తడులను తప్పనిసరిగా అందించాలి. నేల స్వభావం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటిని అందించకుంటే పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.

News January 29, 2026

కరుంగలి మాల ఎందుకు ధరించాలంటే…?

image

కరుంగలి మాల ఆభరణమే కాదు! శక్తిమంతమైన రక్షణ కవచం కూడా. ఇది ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దరిచేరనీయదు. కుజ దోషం ఉన్నవారు దీనిని ధరిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, సోమరితనాన్ని తగ్గించి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు, ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నవారు ఈ పవిత్రమైన మాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని సిద్ధ సంప్రదాయం చెబుతోంది.

News January 29, 2026

రెండు రోజుల లాభాలకు బ్రేక్

image

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ రెండు రోజుల లాభాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా కోల్పోయి 82,093 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 25,274 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమూ భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.