News April 4, 2024

స్టీఫెన్ రవీంద్రపై సీఎంకు ఫిర్యాదు

image

TG: సైబరాబాద్ మాజీ సీపీ, హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్‌కు కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర తనను సస్పెండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల ప్రమోషన్ పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.

Similar News

News November 23, 2025

పెదవులు నల్లగా మారాయా?

image

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్​ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.

News November 23, 2025

వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను మళ్లీ చూస్తామా?

image

SAతో వన్డే సిరీస్‌కు ముందు భారత కెప్టెన్‌ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత కెప్టెన్‌ గిల్‌కు గాయం కాగా, వైస్‌ కెప్టెన్‌ అయ్యర్ కూడా అందుబాటులో లేరని సమాచారం. దీంతో రోహిత్‌ శర్మను మళ్లీ వన్డే కెప్టెన్‌గా తీసుకురావాలా అనే చర్చ మొదలైంది. అయితే ఈ ప్రతిపాదనను రోహిత్‌ తిరస్కరించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ స్పష్టం చేశారు. KL రాహుల్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది.

News November 23, 2025

శబరిమలకు భక్తుల క్యూ.. వారంలోనే 5.75 లక్షల మంది దర్శనం

image

మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నవంబర్‌ 16 నుంచి మొదలైన యాత్రలో తొలి వారంలోనే 5.75 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు 72,845 మంది సన్నిధానానికి చేరుకున్నారు. వర్షం పడినా యాత్రపై ప్రభావం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.