News March 24, 2024
సీ-విజిల్లో ఫిర్యాదు.. 100 నిమిషాల్లో చర్యలు

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్లో సీ-విజిల్ యాప్ని EC ప్రవేశపెట్టింది. దీంట్లో ఫిర్యాదు చేసిన వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్లు రంగంలోకి దిగుతాయి. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తాయి. ఆపై ఆర్వో చర్యలు తీసుకుంటారు. 100 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


