News September 20, 2024
వైవీ, ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ఫిర్యాదు

AP: TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ EO ధర్మారెడ్డిపై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘వైవీ, ధర్మారెడ్డి కలిసి తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేయించి అపవిత్రం చేశారు. తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ CM జగన్కు తెలియకుండా ఇది జరగదు. అందుకే ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


