News September 20, 2024

వైవీ, ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ఫిర్యాదు

image

AP: TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ EO ధర్మారెడ్డిపై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘వైవీ, ధర్మారెడ్డి కలిసి తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేయించి అపవిత్రం చేశారు. తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ CM జగన్‌కు తెలియకుండా ఇది జరగదు. అందుకే ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.

Similar News

News September 19, 2025

భద్రాద్రి: పాపడలా జలపాతం.. పర్యాటకుల సందడి

image

మణుగూరు సమీపంలోని రథం గుట్టపై ఉన్న ‘స్వప్న జలపాతం’ చూపరులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతున్న ఈ జలపాతం నుదుటిన పెట్టుకునే ‘పాపడబిళ్ల’లా కనిపిస్తుందని పర్యాటకులు అంటున్నారు. జలపాతాన్ని సందర్శించేందుకు అనువైన మార్గం లేదని.. ప్రభుత్వం స్పందించి రహదారి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
PC: MANUGURU_UPDATES

News September 19, 2025

రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

image

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.

News September 19, 2025

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ అసోసియేట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* NIT- వరంగల్ 2 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 23వరకు అప్లై చేసుకోవచ్చు.