News September 20, 2024
వైవీ, ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ఫిర్యాదు
AP: TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ EO ధర్మారెడ్డిపై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘వైవీ, ధర్మారెడ్డి కలిసి తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేయించి అపవిత్రం చేశారు. తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ CM జగన్కు తెలియకుండా ఇది జరగదు. అందుకే ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.
Similar News
News September 20, 2024
ఇది ముంచిన ప్రభుత్వం: అంబటి
AP: కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘వంద రోజుల పాలనలో ఏమున్నది గర్వకారణం. పథకాల ఎగవేతలు. పరపార్టీపై నిందలు. రెడ్ బుక్ పీడనలు. ఇది ముంచిన ప్రభుత్వం’ అని విమర్శించారు.
News September 20, 2024
తిరుమల ప్రసాదం కల్తీ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు
తిరుమల ప్రసాదం కల్తీ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్యవహారాలు పర్యవేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజలకు, దీపాలకు, అన్న ప్రసాదాలకు నందిని నెయ్యి మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.
News September 20, 2024
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్కు రంగం సిద్ధమైంది. ఎల్లుండి హైదరాబాద్లోని నోవాటెల్ HICCలో ఈవెంట్ జరుగుతుందని మూవీ టీమ్ ట్విటర్లో ప్రకటించింది. ‘భయమంటే ధైర్యం ఉన్నవారి కోసమే కాదు, అదో వేడుక కూడా. పెద్ద పండుగకు తొలి అడుగు 22న పడుతోంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం’ అని పోస్ట్ చేసింది. సినిమా ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.