News July 8, 2024
భూమన, ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు
AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఎస్ నీరభ్ కుమార్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.
Similar News
News October 6, 2024
రియాద్లో ఐపీఎల్ 2025 మెగా వేలం?
ఐపీఎల్ 18 సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని రియాద్లో జరుగుతుందని తెలుస్తోంది. అది కాకుంటే జెడ్డా వేదికగా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నవంబర్ చివరి వారంలో రెండు రోజులపాటు ఈ ఆక్షన్ జరుగుతుందని తెలుస్తోంది. దుబాయ్లో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ వేలంలో పది ఫ్రాంచైజీల ప్రతినిధులు, జియో, డిస్నీ స్టార్ ప్రతినిధులు, పలువురు కెప్టెన్లు పాల్గొంటారని టాక్.
News October 6, 2024
బడ్జెట్ రూ.7 కోట్లు.. కలెక్షన్స్ రూ.70 కోట్లు!
కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించడంలో సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. ఇటీవలే రిలీజైన ‘కిష్కింధకాండం’ సినిమా సైతం బాక్సాఫీసు వద్ద రూ.70 కోట్ల+ కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించడం గమనార్హం. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి రిలీజైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలు భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
News October 6, 2024
DSC పోస్టుల ఎంపికపై కీలక నిర్ణయం
TG: పలువురు DSC అభ్యర్థులు 2, 3 పోస్టులకు ఎంపికవడం, వారు ఒక పోస్టులో చేరితే వందల ఖాళీలుండటం ప్రతిసారీ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తుంది. ఆ తర్వాత SGTల లిస్ట్ ఇస్తుంది. మొదటి జాబితాలో ఉన్నవారెవరైనా రెండో లిస్టులోనూ ఉంటే ఆ పేరును తొలగించేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది.