News March 22, 2024
ఏపీ సీఈవోకు వైసీపీ నేతల ఫిర్యాదు

AP: ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాను వైసీపీ నేతలు కలిశారు. డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. తమపై బురద చల్లుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడని మండిపడ్డారు.
Similar News
News December 2, 2025
వరంగల్: 19 పంచాయతీలు ఏకగ్రీవం!

ఉమ్మడి జిల్లాలో 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయి. జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. జనగామలో రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, తరిగొప్పుల మండలాల్లో ఆరు పంచాయతీలు, వర్ధన్నపేట, రాయపర్తిలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. భూపాలపల్లిలో చెంచుపల్లి, మహబూబాబాద్లో మూడు పంచాయతీలు ఒక్కో నామినేషన్తో ఏకగ్రీవం కావడం ప్రత్యేకత.
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.
News December 2, 2025
CTETకు దరఖాస్తు చేశారా?

CTET అర్హత కోసం అభ్యర్థుల నుంచి CBSE దరఖాస్తులు కోరుతోంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.Ed, D.EI.Ed అర్హతగల వారు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET ఉత్తీర్ణత తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. ctet.nic.in/


