News November 19, 2024
రేప్ కేసులపై FBలో ఫిర్యాదు: సుప్రీంకోర్టు కీలక ప్రశ్న

మలయాళ నటుడు <<14650875>>సిద్ధిఖ్<<>> రేప్ కేసు విచారణలో SC వ్యాఖ్యలు చర్చనీయంగా అయ్యాయి. 2016లో సిద్ధిఖ్ తనపై లైంగిక దాడి చేశారని ఓ మహిళ మీటూ ఉద్యమం టైమ్లో FBలో రాసుకొచ్చారు. తర్వాత FIR ఫైల్ అయింది. ‘FBలో రాయడానికి ధైర్యమున్నప్పుడు ఎనిమిదేళ్లుగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు’ అని కోర్టు ప్రశ్నించింది. కొన్ని కేసుల్లో భయపడి ఫిర్యాదు చేయకపోవడం, కొన్నింట్లో కావాలనే ఇరికిస్తుండటంతో వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
Similar News
News December 15, 2025
IPLలో అదుర్స్.. T20Iల్లో చెత్త ప్రదర్శన

భారత ప్లేయర్లు సూర్య కుమార్, గిల్ ప్రదర్శన T20Iల్లో ఆందోళన కలిగిస్తోంది. IPL-2025లో సత్తా చాటిన ఈ ప్లేయర్లు, దేశం తరఫున పేలవ ప్రదర్శన చేస్తున్నారు. IPLలో సూర్య 65.18 సగటుతో 717 రన్స్, గిల్ 50 యావరేజ్తో 650 పరుగులు చేశారు. అయితే ఇండియా తరఫున మాత్రం స్కై 14.20 సగటుతో 213, గిల్ 24.25 సగటుతో 291 పరుగులే చేశారు. దీంతో ఈ ప్లేయర్ల స్థానంలో ఇతర ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
News December 15, 2025
హత్యాచార దోషికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

MHలో రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్షను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవి అశోక్కు 2019లోనే సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనికి శారీరక కోరికలపై కంట్రోల్ లేదని, లైంగిక వాంఛను తీర్చుకునేందుకు అన్ని పరిమితులను ఉల్లంఘించారని తీర్పునిచ్చింది. ముర్ము బాధ్యతలు స్వీకరించాక 3 సార్లు క్షమాభిక్షను తిరస్కరించారు.
News December 15, 2025
ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.


