News June 25, 2024

సజ్జల రామకృష్ణారెడ్డిపై CIDకి ఫిర్యాదు

image

AP: YCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై CIDకి ఫిర్యాదు అందింది. దౌర్జన్యం చేసి గనులు దోచేశారని నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ CID DSPకి ఫిర్యాదు చేశారు. ‘సైదాపురం(మ) జోగుపల్లిలో మాకు 240 ఎకరాలు ఉంది. అక్కడ 8 గనులు ఉన్నాయి. రెండేళ్లుగా మా గనులను అక్రమంగా దోచారు. రూ.వేల కోట్లు దోచుకున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారు’ అని బద్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News January 29, 2026

కరుంగలి మాల ఎందుకు ధరించాలంటే…?

image

కరుంగలి మాల ఆభరణమే కాదు! శక్తిమంతమైన రక్షణ కవచం కూడా. ఇది ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దరిచేరనీయదు. కుజ దోషం ఉన్నవారు దీనిని ధరిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, సోమరితనాన్ని తగ్గించి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు, ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నవారు ఈ పవిత్రమైన మాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని సిద్ధ సంప్రదాయం చెబుతోంది.

News January 29, 2026

రెండు రోజుల లాభాలకు బ్రేక్

image

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ రెండు రోజుల లాభాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా కోల్పోయి 82,093 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 25,274 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమూ భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

News January 29, 2026

వడ్డీ రేట్లు యథాతథం: US FED

image

వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. 3.5%-3.75%గా ఉన్న వడ్డీరేట్లను అలాగే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు.