News April 28, 2024

సీఎస్‌పై గవర్నర్‌ నజీర్‌కు ఫిర్యాదు

image

ఏపీ సీఎస్, పింఛన్ల పంపిణీ వ్యవహారంపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ కనుసన్నల్లో సీఎస్ జవహర్ రెడ్డి పని చేస్తున్నారని టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, జనసేన నేత శంకర్ ఆరోపించారు. పింఛన్ల పంపిణీలో సీఎస్ బాధ్యతగా స్పందించలేదని అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఇంటికే వెళ్లి పెన్షన్ అందించేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

Similar News

News November 24, 2025

అల్లూరి జిల్లా వాసులకు GOOD NEWS

image

UPSC స్రివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ కోసం అర్హులైన ST అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు పాడేరు DD PBK పరిమళ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ST అభ్యర్థులు తమ బయోడేటా, 2 ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్ ఇతర జిరాక్స్ కాపీలతో ఈనెల 26లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

News November 24, 2025

అద్దె ఇంట్లో ఏ దిశన పడుకోవాలి?

image

సొంత ఇల్లు/అద్దె ఇల్లు.. అది ఏదైనా ఆరోగ్యం కోసం తల దక్షిణ దిశకు, పాదాలు ఉత్తర దిశకు పెట్టి నిద్రించడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘ఈ దిశలో నిద్రించడం అయస్కాంత క్షేత్రాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దక్షిణ దిశలో నిద్రించడం సదా ఆరోగ్యకరమైన అలవాటు. తూర్పు దిశలో తలపెట్టి పడుకోవడం కూడా ఉత్తమమే’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 24, 2025

అండర్ వరల్డ్‌ మాఫియాకు బెదరని ధర్మేంద్ర

image

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ 1980, 90ల్లో అండర్ వరల్డ్ మాఫియా బెదిరింపులను విపరీతంగా ఎదుర్కొంది. భయంతో కొందరు నటులు సినిమాలను నిలిపివేయగా, మరికొందరు వారికి డబ్బులు ఇచ్చేవారు. అయితే <<18377596>>ధర్మేంద్ర<<>> మాత్రం వారికెప్పుడూ తలొగ్గలేదని డైరెక్టర్ సత్యజీత్ పూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎవరైనా ఆయనను బెదిరింపులకు గురిచేస్తే పంజాబ్ నుంచి గ్రామస్థులు ట్రక్కుల్లో వస్తారని తిరిగి వార్నింగ్ ఇచ్చేవాడని గుర్తుచేశారు.