News April 28, 2024

సీఎస్‌పై గవర్నర్‌ నజీర్‌కు ఫిర్యాదు

image

ఏపీ సీఎస్, పింఛన్ల పంపిణీ వ్యవహారంపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ కనుసన్నల్లో సీఎస్ జవహర్ రెడ్డి పని చేస్తున్నారని టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, జనసేన నేత శంకర్ ఆరోపించారు. పింఛన్ల పంపిణీలో సీఎస్ బాధ్యతగా స్పందించలేదని అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఇంటికే వెళ్లి పెన్షన్ అందించేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

Similar News

News November 17, 2025

శివ పూజలో తులసిని వాడుతున్నారా?

image

శివుడికి సంబంధించి ఏ పూజలు నిర్వహించినా అందులో మాల, తీర్థం ఏ రూపంలోనూ తులసిని వినియోగించకూడదనే నియమం ఉంది. శివ పురాణం ప్రకారం.. తులసి వృంద అనే పతివ్రతకు ప్రతిరూపం. ఆమె భర్త జలంధరుడిని శివుడు సంహరించాడు. అప్పుడు శివుడి పూజలో తన పవిత్ర రూపమైన తులసిని వాడరని శాపమిచ్చింది. అందుకే శివుడికి బిల్వపత్రాలు ప్రీతిపాత్రమైనవి. గణపతి పూజలోనూ తులసిని ఉపయోగించరు.

News November 17, 2025

iBomma ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా?

image

ఇమ్మడి రవి అరెస్టుతో iBomma, బప్పం టీవీ <<18302048>>బ్లాక్ <<>>అయిన విషయం తెలిసిందే. అయితే అవి ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. iBommaకు ముందు ఎన్నో పైరసీ సైట్లు ఉన్నాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. వాటిపైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఐబొమ్మ ప్లేస్‌లోకి అవి వస్తాయంటున్నారు. డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని పేర్కొంటున్నారు. మీరేమంటారు?

News November 17, 2025

కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

image

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.