News September 20, 2024

మాజీ మంత్రి విడదల రజనిపై హోంమంత్రికి ఫిర్యాదు

image

AP: మాజీ మంత్రి రజని, ఆమె PA తమను బెదిరించి ₹2.20cr వసూలు చేశారని పల్నాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ సహ యజమాని చలపతిరావు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. 2020లో తనను పిలిచి మాట్లాడారని, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీని సీజ్ చేయిస్తామని బెదిరించారన్నారు. 2021లో ₹2.20cr ఇచ్చినట్లు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై హోంమంత్రి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Similar News

News November 14, 2025

ఉప ఎన్నికల విజేతలు వీరే

image

* జూబ్లీహిల్స్(TG)- నవీన్ యాదవ్(INC)
* అంతా(రాజస్థాన్)- ప్రమోద్ జైన్(INC)
* నువాపడా(ఒడిశా)- జయ్ ఢొలాకియా(BJP)
* నాగ్రోటా(J&K)- దేవయానీ రాణా(BJP)
* బడ్గాం(J&K)- ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ(PDP)
* డంపా(మిజోరం)- లాల్‌థాంగ్లియానా(MNF)
* తరన్‌తారన్(పంజాబ్)- హర్మీత్ సింగ్ సంధు(AAP)
* ఘాట్‌శిలా(ఝార్ఖండ్)- సోమేశ్ చంద్ర సోరెన్(JMM)

News November 14, 2025

రహదారిపై షెడ్లు, నిర్మాణాలు చేయవచ్చా?

image

ఇంటి ముందు దారిపై వాహనం నిలపడం, కారు పార్క్‌కు షెడ్లు వేయడం సరికాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తమ సొంత స్థలంలో ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాలి కానీ, అందరికీ చెందాల్సిన రహదారిలో ఆటంకం కలిగించేలా నిర్మాణాలు చేయడం ఆ ఇంటికి, ఇంట్లో సభ్యులకు మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ధోరణితో గొడవలు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వాస్తు శాంతికి సామాజిక శాంతి కూడా ముఖ్యమే’ అని అంటారు. <<-se>>#Vasthu<<>>

News November 14, 2025

అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

image

AP: భవిష్యత్‌ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్‌లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.