News October 5, 2024
నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి N-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News July 5, 2025
త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ప్రభుత్వం త్వరలో NTR బేబీ కిట్లు అందించనుంది. 2016లోనే ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. కిట్లో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్, ఆయిల్ వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి.
News July 5, 2025
పాప్ సింగర్స్ను వెనక్కినెట్టిన అర్జీత్

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జీత్ సింగ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పాటిఫైలో 151 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టేలర్ స్విఫ్ట్(139.6M), ఎడ్ షీరన్(121M) వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ను వెనక్కినెట్టారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సింగర్గా నిలిచారు. అర్జీత్ తర్వాత ఇండియన్స్లో ఏఆర్ రెహమాన్(65.6M) 14వ స్థానం, ప్రీతమ్(53.4M) 21, నేహా కక్కర్(48.5M) 25వ ప్లేస్లో ఉన్నారు.
News July 5, 2025
జైస్వాల్ ఖాతాలో అరుదైన రికార్డు

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ జైస్వాల్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో 28 రన్స్ చేసి ఔటైన జైస్వాల్ టెస్టుల్లో వేగంగా 2000 రన్స్ పూర్తిచేసిన భారత ప్లేయర్గా నిలిచారు. 40 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయి చేరుకుని లెజెండ్స్ సెహ్వాగ్, ద్రవిడ్ సరసన చేరారు. మరోవైపు దిగ్గజం సచిన్ తర్వాత 2 వేల రన్స్ పూర్తిచేసిన రెండో యంగెస్ట్ ప్లేయర్గా జైస్వాల్ నిలిచారు.