News April 19, 2024

అధికారులపై ఫిర్యాదులు.. CEC నిర్ణయం కోసం చూస్తున్నాం: ముకేశ్ కుమార్

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు.

Similar News

News February 5, 2026

ఏపీలోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

AP: కాకినాడలోని <>ESIC<<>> హాస్పిటల్ 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 14వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి MBBS+ పీజీ, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 69ఏళ్లు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 5, 2026

తులసి మొక్కను నాటుతున్నారా?

image

తులసి మొక్క నాటేందుకు గురు, శుక్రవారాలు శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, ఆది, సోమవారాలతో పాటు గ్రహణ సమయంలో నాటకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో ఉంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన. దక్షిణ, నైరుతి దిశల్లో అస్సలు ఉంచకూడదంటున్నారు. అయితే తులసి మొక్కను ఎవరు నాటాలి, ఎవరు నాటకూడదో అని నియమాలున్నాయి. వాటి పూర్తి వివరాలకై క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News February 5, 2026

నటి జయవాహిని కన్నుమూత

image

సీరియల్, సినిమా నటి జయవాహిని (పద్మక్క) కన్నుమూశారు. కొంతకాలంగా రొమ్ము <<18545877>>క్యాన్సర్‌తో<<>> బాధపడుతున్న ఆమె నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమెను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశామని తెలిపారు. రఘుపతి వెంకయ్య నాయుడు, బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలతో పాటు పలు సీరియళ్లలో ఆమె నటించారు.