News November 16, 2024

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కంప్లైంట్ బాక్స్‌లు పెట్టాలి: HC

image

TG: ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాలని హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. వినతులు, ఫిర్యాదులు వస్తే రిజిస్ట్రార్ లేదా ఆపై అధికారులు పరిశీలించి విచారణ చేపట్టాలని చెప్పింది. రంగారెడ్డి(D) జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.

Similar News

News December 14, 2025

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్

image

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రిగా ఉన్నారు. అటు UP BJP అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 7 సార్లు ఎంపీగా గెలిచారు.

News December 14, 2025

వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

image

TG: మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి NOTAకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.

News December 14, 2025

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>